యాప్నగరం

TRS‌ ఎమ్మెల్యేను కలిశా.. హోం క్వారంటైన్‌లో ఉన్నా: బాబుకు టీడీపీ ఎమ్మెల్యే లేఖ

ప్రజల ప్రాణాలను హరిస్తున్న కరోనా మహమ్మారి ఎవరి ప్రాణాలకు ముప్పు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నారు ఎమ్మెల్యే. దయచేసి తనను మన్నించాలని.. తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉంటున్న తాను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనకపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు.

Samayam Telugu 19 Jun 2020, 1:57 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న కారణంగా ఓటింగ్‌కు రాలేదని.. వ్యాపారరీత్యా టీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిశాను అన్నారు. ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్ తేలిందని.. అందుకే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాను అన్నారు. డాక్టర్లు సూచన మేరకు రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌కు రాలేదన్నారు.
Samayam Telugu చంద్రబాబుకు ఎమ్మెల్యే లేఖ


ప్రజల ప్రాణాలను హరిస్తున్న కరోనా మహమ్మారి ఎవరి ప్రాణాలకు ముప్పు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నారు ఎమ్మెల్యే. దయచేసి తనను మన్నించాలని.. తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉంటున్న తాను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనకపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. పార్టీకి ఏ అవసరం వచ్చినా ముందుండే తాను ఈ విషయంలో రాలేక పోతున్నానుని.. కనుక తనను మన్నించాలన్గనారు. పార్టీకి అవసరమైనప్పుడు ఎల్లవేళలా ముందుంటానని, చంద్రబాబు ఆశీస్సులు, భగవంతుని దయ తనకుఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు.

ఇటు మరో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా ఏసీబీ అరెస్ట్‌తో ఓటింగ్‌కు రాలేకపోయారు. అలాగే ఉంటే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాళి గిరిధర్ ఓటింగ్‌కు వచ్చారు. వీరిద్దరూ గురువారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణకు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే కరణం బలరాం మాత్రం మధ్యాహ్నం వరకు ఓటు వేయడానికి రాలేదు. ఇక జనసేన ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటు వేసినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.