యాప్నగరం

TDP ఎమ్మెల్యే దంపతులకు కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్

విజయవాడలోని అమరావతి రోడ్డులో ఉన్న జ్వరాల ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్‌ నియంత్రణకు భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ తొలి ట్రయల్‌లో గత నెల 7న మొదటి డోసు తీసుకున్నారు.

Samayam Telugu 5 Jan 2021, 7:18 am
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ దంపతులు కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. రామ్మోహన్, అనురాధలు విజయవాడలోని అమరావతి రోడ్డులో ఉన్న జ్వరాల ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్‌ నియంత్రణకు భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ తొలి ట్రయల్‌లో గత నెల 7న మొదటి డోసు తీసుకున్నారు. 28 రోజుల తర్వాత మళ్లీ రెండో డోసు టీకా తీసుకున్నారు. ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ తీసుకున్న తమకు అంతా బాగానే ఉందని.. ఎలాంటి సమస్యలు లేవని గద్దె రామ్మోహన్‌ దంపతులు అన్నారు.. త్వరలోనే అందరికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాలని వారు ఆకాంక్షించారు.
Samayam Telugu ఎమ్మెల్యే దంపతులు (Photo Credit-ramamohan.gadde)


రాష్ట్రంలో తాజా పరిణామాలపై గద్దే స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పేదానికి చేసే దానికి పొంతన లేకుండా పోయిందని అన్నారు. ప్రాంతాలు,మతాల మద్య చిచ్చు ప్రయత్నం ప్రభుత్వం చేయడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేకాట శిబిరాలు,దాడులు జరుగుతున్నాయన్నారు. రాజకీయాలు కూడా వికృతంగా ఉన్నాయన్న గద్దె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బూతులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి కంటే వివాదాస్పద కార్యక్రమాలకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.