యాప్నగరం

24 గంటల టైం చాలంటున్న టీడీపీ ఎమ్మెల్యే.. బెజవాడలో ఆ టాస్క్ పూర్తి చేస్తారట

ప్రభుత్వం తనకు సహకరిస్తే 24 గంటల్లో విజయవాడ మొత్తం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయిస్తాను అంటున్నారు. ఫైర్ ఇంజిన్లు సమకూరిస్తే చాలు ఒక్క రోజులో నగరమంతా కెమికల్ చల్లిస్తానని చెబుతున్నారు.

Samayam Telugu 9 Apr 2020, 10:18 am
కరోనా కట్టడికి తనవంతు కృషి చేస్తానంటున్నరు టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్. విజయవాడలో శానిటైజేషన్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తనకు సహకరిస్తే 24 గంటల్లో విజయవాడ మొత్తం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయిస్తాను అంటున్నారు. ఫైర్ ఇంజిన్లు సమకూరిస్తే చాలు ఒక్క రోజులో నగరమంతా కెమికల్ చల్లిస్తానని చెబుతున్నారు. ఈ ద్రావణం ప్రాముఖ్యత తెలియడంతో తన సొంత నిధులు, సొంత వాహనాలతో 21వ డివిజన్ లో చల్లిస్తున్నానని చెప్పుకొచ్చారు.
Samayam Telugu vja


కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ఇంట్లోనే ఉండటం, సబ్బుతో చేతులు శుభ్రంగా కడగడంతో పాటు సోడియం హైపో క్లోరైడ్ వీధుల్లో చల్లాలి అని వ్యాఖ్యానించారు. శానిటైజేషన్ చేస్తే వైరస్‌ను కట్టడి చేయొచ్చని వ్యాఖ్యానించారు. తన విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో శానిటైజేషన్ పనుల్ని ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.. అలాగే సేవా కార్యక్రమాలను చేపట్టారు.

అంతేకాదు కరోనా వంటి విపత్కర పరిస్థితులలో పరిపాలనాధక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు సేవలను ప్రభుత్వం వినియోగించుకోలేక పోయిందన్నారు రామ్మోహన్. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే చంద్రబాబు సలహాలు తీసుకున్నా ఎంతో బాగుండేదని.. ఎలాంటి అంటు రోగాలు ప్రభల కుండా పుష్కరాలు నిర్వహించిన సమర్ధవంతమైన నాయకుడు చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం కరోనాపై యుద్ధం చేయకుండా ఆయన్ను విమర్శించడం పనిగా పెట్టుకుందని.. చంద్రబాబును విమర్శించే స్థాయి ప్రభుత్వంలో ఎవరికీ లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.