యాప్నగరం

సతీమణితో కలిసి ఇంట్లో దీక్షకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే

విజయవాడలోని ఇంట్లో దీక్షకు దిగిన దంపతులు. 12 గంటల పాటూ వీరి దీక్షలు కొనసాగనున్నాయి.. గద్దే దంపతులకు విజయవాడ ఎంపీ కేశినేని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మద్దతు తెలిపారు.

Samayam Telugu 13 Apr 2020, 11:48 am
కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వేళ టీడీపీ ఎమ్మెల్యే దీక్ష ఆసక్తికరంగా మారింది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, సతీమణి అనురాధ దంపతులు తమ ఇంట్లో దీక్షకు కూర్చున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.5వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అన్న క్యాంటిన్లు, చంద్రన్న బీమా పథకాలు పునరుద్ధరించాలని కోరుతున్నారు. 12 గంటల పాటూ వీరి దీక్షలు కొనసాగనున్నాయి. గద్దే దంపతులకు విజయవాడ ఎంపీ కేశినేని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మద్దతు తెలిపారు.. వారు కూడా సంఘీభావంగా కొద్దిసేపు ఈ దీక్షా శిబిరంలో కూర్చున్నారు.
Samayam Telugu vjaa


దీక్ష సమయంలో సామాజిక దూరం పాటిస్తూ శిబిరంలో కూర్చున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గతంలో రూ.5వేలు సాయం చేయాలని.. అన్నా క్యాంటిన్లు తెరవాలని, చంద్రన్న బీమాను పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖలు కూడా రాశారు. అంతేకాదు గద్దే దంపతులు మాత్రమే కాదు.. ఒకరిద్దరు టీడీపీ నేతలు ఇదే తరహాలో దీక్షలకు దిగారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి రైతులకు మద్దతుగా దీక్ష చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.