యాప్నగరం

జగన్‌తో చిరు భేటికి గంటా దూరం..! త్వరలో మెగాస్టార్‌తో కలిసి ఢిల్లీకి?

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో చిరంజీవి సమావేశం అవుతున్నారు. సైరా సినిమా కోసమే చిరు ఈ భేటీకి వెళ్తున్నారని తెలుస్తోంది. రామ్‌చరణ్ వైజాగ్‌లో స్టూడియోను నిర్మించనున్నారని, దీనికి సాయం చేయాలని చిరంజీవి సీఎంను కోరే అవకాశం ఉంది.

Samayam Telugu 14 Oct 2019, 1:54 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవడం కోసం చిరంజీవి హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లారు. ప్రత్యేక విమానంలో సతీసమేతంగా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో జగన్‌ను కలవడానికి ముందు.. ఆయన తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. విజయవాడ పటమటలోని పవన్ ఇంటికి చిరంజీవి దంపతులు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 11.30 గంటలకే గన్నవరం చేరుకున్న చిరంజీవి.. కాసేపు విశ్రాంతి కోసం తన సోదరుడి ఇంటికి వెళ్లారు.
Samayam Telugu ganta jagan


ఈరోజు మధ్యాహ్నం సీఎంతో చిరంజీవి లంచ్ మీటింగ్ ఉండనుందని సమాచారం. ఈ భేటీలో గంటా శ్రీనివాస రావు కూడా పాల్గొంటారని వార్తలొచ్చాయి. కానీ ఆయన ఈ భేటీలో పాల్గొనడం లేదని సమాచారం. జగన్ కలవడం కోసం చివరి నిమిషంలో గంటా వెనక్కి తగ్గారని వార్తలు వస్తున్నాయి.

ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదని.. సైరా సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పడం కోసమే చిరు సీఎంను కలుస్తున్నారని తెలుస్తోంది. సైరా సినిమా చూడాలని చిరంజీవి జగన్‌ను కోరే అవకాశం ఉంది.

ఈ నెల 16న ఉపరాష్ట్రపతిని చిరంజీవి కలిసే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం గంటా కూడా ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. ప్రధాని మోదీ సహా బీజేపీ పెద్దలను కూడా చిరంజీవి, గంటా కలిసే అవకాశం ఉందని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.