యాప్నగరం

'పోలవరం'లో చంద్రబాబు కట్టిన గ్రాఫిక్స్ చూడడానికి వెళ్లిన జగన్ గారికి ధన్యవాదాలు.. టీడీపీ ఎమ్మెల్యే ట్వీట్

సోమవారం రోజున'పోలవరం'లో చంద్రబాబు గారు కట్టిన గ్రాఫిక్స్ చూడడానికి వెళ్లిన సీఎం జగన్ గారికి ధన్యవాదాలు అంటూ టీడీపీ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.

Samayam Telugu 14 Dec 2020, 12:07 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం పర్యటనపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర ట్వీట్ చేశారు. సోమవారం రోజున'పోలవరం'లో చంద్రబాబు గారు కట్టిన గ్రాఫిక్స్ చూడడానికి వెళ్లిన సీఎం జగన్ గారికి ధన్యవాదాలు అంటూ స్పందించారు. పోలవరం గ్రాఫిక్స్ అన్నారు,మరి ఇప్పుడు ఏకంగా పర్యటనలు ఏంటో?.. అందుకే అన్నారు F2 సీఎం అని..ఫేక్ అండ్ ఫెయిల్యూర్ సీఎం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కొంపదీసి ప్రాజెక్టుకి కూడా రంగులు వెయిస్తారా అంటూ సెటైర్లు పేల్చారు.
Samayam Telugu పోలవరం ప్రాజెక్ట్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరంలో పర్యటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం ప్రాజెక్టు పనులు ఏరియల్ సర్వే చేశారు. తర్వాత స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల తీరును పరిశీలించారు. అనంతరం పనులు జరుగుతున్న తీరును అధికారులు జగన్‌కు వివరించారు. సీఎం వెంట ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. జగన్ పర్యటనపై గోరంట్ల ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.