చీఫ్ జస్టిస్కి కనీస గౌరవం ఇవ్వని జగన్ సర్కార్.. టీడీపీ తీవ్ర ఆరోపణలు
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల పర్యటనకు వస్తే జగన్ సర్కార్ కనీస గౌరవం పాటించలేదని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రొటోకాల్ కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Samayam Telugu 12 Jun 2021, 7:50 pm
జగన్ సర్కార్పై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐ హోదాలో తొలిసారి తిరుమల పర్యటనకు వస్తే ప్రభుత్వ పరంగా కనీసం గౌరవం ఇవ్వలేదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కనీస ప్రొటోకాల్ పాటించలేదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఒక తెలుగువాడు అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్గా ఎంపికవడం తెలుగుజాతికి గర్వకారణమని.. కానీ జగన్ సర్కార్ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సీజేఐకి సరైన మర్యాద ఇవ్వలేదని ఆయన ఆక్షేపించారు. రాజకీయం చేస్తున్నారంటూ విపక్షాలపై ఎదురుదాడికి దిగడం అత్యంత దారుణమని అని గోరంట్ల వ్యాఖ్యానించారు.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా రెండు రోజుల కిందట తిరుమల పర్యటనకు విచ్చేశారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసిన చీఫ్ జస్టిస్.. మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరుచానూరు వెళ్లి అమ్మవారిని దర్శించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే టీటీడీ పాలకవర్గం, అధికారులు మినహా రాష్ట్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదని.. కనీస ప్రొటోకాల్ పాటించలేదని టీడీపీ ఆరోపిస్తోంది.
Also Read:
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా రెండు రోజుల కిందట తిరుమల పర్యటనకు విచ్చేశారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసిన చీఫ్ జస్టిస్.. మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరుచానూరు వెళ్లి అమ్మవారిని దర్శించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే టీటీడీ పాలకవర్గం, అధికారులు మినహా రాష్ట్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదని.. కనీస ప్రొటోకాల్ పాటించలేదని టీడీపీ ఆరోపిస్తోంది.
Also Read: