యాప్నగరం

ఢిల్లీ వెళుతున్న సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 19 Jan 2021, 9:07 am
ఢిల్లీ పర్యటనకు వెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ టార్గెట్ చేసింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా సీఎంకు రిక్వెస్ట్ చేశారు, కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఈ రోజు మీ ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి లాభం తెస్తుందా?.. రావాల్సిన నిధులు,ప్రత్యేక హోదా పై మీరు పోరాడాలి. మీరు వెళ్తున్నారా.. లేక బీజేపీ, కేంద్ర పెద్దలు మీ మత రాజకీయాలు గురించి పిలిపిస్తున్నారా..?’ అంటూ ట్వీట్ చేశారు.
Samayam Telugu సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ బయల్దేరనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని సీఎం జగన్‌ కోరనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా అమిత్‌ షాతో చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీలో విగ్రహాల ధ్వంసంకు సంబంధించి పూర్తి నివేదికను కేంద్రానికి సీఎం జగన్ అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి సంబంధించి రాజకీయాలు మతం రంగు పులుముకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ ప్రాధాన్యత ఏర్పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.