యాప్నగరం

సైకిల్‌పై టీడీపీ ఎమ్మెల్యే 106 కి.మీ ప్రయాణం.. ఆసక్తికర కారణం

సైకిల్‌పై పాలకొల్లు నుంచి ఏలూరు వెళ్లిన ఎమ్మెల్యే రామానాయుడు. రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఇలా సైకిల్ యాత్ర చేపట్టినట్లు చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యే.

Samayam Telugu 6 Apr 2020, 12:13 pm
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టారు. పాలకొల్లు నుంచి ఏలూరుకు సైకిల్‌పై వెళ్లారు.. దాదాపు 106 కిలోమీటర్లు ఈ ప్రయాణం కొనసాతుంది. రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఇలా సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. ఆక్వా , వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఎన్ని రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో.. రైతు సమస్యల్ని ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించడానికి ఇలా చేశానంటున్నారు ఎమ్మెల్యే.
Samayam Telugu mla


రైతుల సమస్యలపై ఫోన్‌లో మాట్లాడాలనుకుంటే.. కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా అధికారులు అందుబాటులో ఉండటం లేదని రామానాయుడు మండిపడ్డారు. ఓ ప్రజా ప్రతినిధితో మాట్లాడటం కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైన పనులు అధికారులకు ఏమున్నాయో తనకు తెలియడం లేదన్నారు. రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తాను అన్నారు. వ్యవసాయ రంగంలో మంత్రుల ప్రకటన ధరలకు.. క్షేత్రస్థాయిలో ఉన్న ధరలకు పొంతనలేదన్నారు నిమ్మల. రైతులకు గిట్టుబాటు ధరలు, బకాయిలు, సాగునీరు అందించాలన్నారు.

రామానాయుడు గతంలో కూడా వివిధ సమస్యలపై సైకిల్ యాత్ర చేశారు. అంతేకాదు లాక్‌డౌన్, కరోనా వేళ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాలకొల్లులో సైకిల్‌పై తిరిగారు. జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని కోరారు.. అలాగే నిత్యావసరాలు, కూరగాయల ధరలపై ఆరా తీశారు. అంతేకాదు మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలో శానిటేషన్‌లో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.