యాప్నగరం

సీఎం జగన్ రాజధాని ప్రకటన వెనక రహస్యమిదే.. ఎమ్మెల్యే పయ్యావుల కొత్త లాజిక్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నం రాజధాని కాబోతోందని.. త్వరలోనే తాను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం వెనక అనేక కారణాలున్నాయన్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 31 Jan 2023, 6:35 pm
విశాఖపట్నం రాజధాని కాబోతోందని.. త్వరలోనే తాను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సరికొతత వాదన తీసుకొచ్చారు. సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
Samayam Telugu పయ్యావుల కేశవ్ (ఫైల్ ఫొటో)


వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచడంతో సీఎం జగన్ ఉన్నఫలంగా విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డిని విచారించిన నేపథ్యంలో.. ఆయన సెల్ ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడారనే అంశాలు కీలకంగా మారాయన్నారు.

ఆ కాల్ డేటా వివరా‌లు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం జగన్‌.. విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన అప్పీల్ పెండింగ్‌లోనే ఉండగానే.. సీఎం జగన్‌ ప్రకటన కోర్టు దిక్కరణ అవుతుందన్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.