యాప్నగరం

వార్డు వాలంటీర్ల మొబైల్స్‌ సీజ్‌ చేయండి.. ఏపీ హైకోర్టులో సంచలన పిటిషన్

శాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు లబ్ధిదారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

Samayam Telugu 25 Feb 2021, 7:16 am

ప్రధానాంశాలు:

  • వార్డు వాలంటీర్లకు మొబైల్స్ సీజ్ చేయాలని పిటిషన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఏపీ హైకోర్టు
వాలంటీర్లకు మొబైల్స్ ఇవ్వడంపై మరోసారి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ పిటిషన్‌ దాఖలుచేశారు. విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు లబ్ధిదారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ముగిసే వరకు వారికి ఇచ్చిన మొబైల్స్ సీజ్‌ చేయాలని కోరారు.
ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న అధికారపార్టీ రంగులను తొలగించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు. రంగులపై గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు స్పందించింది.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు బుధ వారం ఆదేశాలు ఇచ్చారు. పిటిషనర్‌ ఎమ్మెల్యే వెలగపూడి తరఫున న్యాయవాది ప్రణతి వాదనలు వినిపించారు. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.