యాప్నగరం

AP Assembly: నోటికి నల్ల రిబ్బన్ కట్టుకున్న లోకేష్

ఏపీ అసెంబ్లీ ఆవరణలో టీడీపీ వినూత్న నిరసనలు. మీడియాపై ఆంక్షలు, జీవో 2430 రద్దు చేయాలంటూ ఆందోళన. నోటికి నల్ల రిబ్బన్‌లు కట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

Samayam Telugu 12 Dec 2019, 9:15 am
ఏపీ అసెంబ్లీ దగ్గర టీడీపీ నిరసన తెలిపింది. మీడియాపై ఆంక్షలకు నిరసనగా.. జీవో 2430 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. కళ్లకు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలియజేశారు. అసెంబ్లీ వరకు నేతలు ర్యాలీగా వెళ్లగా.. గేటు దగ్గర టీడీపీ నేతల్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
Samayam Telugu lokesh


టీడీపీ నేతలు తీసుకొచ్చిన ప్లకార్డుల్ని లోపలికి అనుమతించమని భద్రతా సిబ్బంది తేల్చి చెప్పారు. భద్రతా సిబ్బందితో టీడీపీ ఎమ్మెల్యేల వాగ్వాదానికి దిగారు. దీంతో అసెంబ్లీ గేటు దగ్గర బైఠాయించి టీడీపీ నేతల నిరసన తెలిపారు. ఈ నిరసనలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ నారా లోకేష్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

గత మూడు రోజులుగా టీడీపీ రోజుకో అంశంపై తమ నిరసనను తెలియజేస్తోంది. మొదటి రోజు ఉల్లి ధరలపై నిరసన తెలియజేయగా.. రెండో రోజు రైతు సమస్యలపై.. మూడో రోజు ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఆందోళనలు చేసింది. మాజీ మంత్రి లోకేష్‌తో పాటూ పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రజల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.