యాప్నగరం

‘సీఎం జగన్‌ను జైలుకు పంపేందుకు ఏర్పాట్లు.. గెట్ రెడీ’

సీఎం వైఎస్ జగన్‌ను, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని మళ్లీ జైలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 5 Feb 2020, 7:17 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీ నేతలు జైలుకు వెళ్తారని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంగళవారం బుద్దా వెంకన్న ట్విట్టర్‌లో కౌంటర్లు వేశారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డి కలిసి మొదలుపెట్టిన మూడు రాజధానుల దందా వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలిసి అధికారులు పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి ముందు వారిని ఆపే మార్గం చూడాలని ఎద్దేవా చేశారు.
Samayam Telugu ys-jagan-vijaysai


Also Read: త్వరలో మీ రాజకీయ జీవితాలు క్లోజ్.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

16 నెలలు జైలు జీవితం గడిపిన విజయసాయిరెడ్డికి మా రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి అనే అంత ధైర్యం వచ్చిందా? అని ప్రశ్నించారు. అంత వరకూ వచ్చాక తాము మాత్రం చూస్తూ కూర్చోబోమని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ను, విజయసాయిని మళ్లీ జైలుకు పంపేదుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రెడీ గా ఉండండంటూ షాకింగ్ ట్వీ్ట్లు చేశారు.

Also Read: జగన్ సర్కారు కీలక నిర్ణయం.. దొనకొండకు భారీ ప్రాజెక్టు!

పాత తప్పులు, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో విశాఖపట్నంలో చేస్తున్న భూముల దందా అంతా బయటపడుతుందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. విజయసాయి, ఆయన పరివారం ఊచలు లెక్కపెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.