యాప్నగరం

'ఆ డబ్బు మేమిస్తాం.. నా సవాల్‌కు జగన్, విజయసాయి రెడీనా'

VIjaya Sai Reddy| 'ఆ డబ్బు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.. మరి నా సవాల్‌కు ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి రెడీనా' సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.

Samayam Telugu 16 Nov 2019, 12:59 pm
ఇసుక వ్యవహారంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు దీక్ష తర్వాత వైఎస్సార్‌సీపీ-టీడీపీల పెద్ద యుద్ధమే నడుస్తోంది. బాబువి దొంగ దీక్షలని మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపిస్తే.. ముందు ఇసుక కొరత తీర్చండి అంటూ టీడీపీ కౌంటరిస్తోంది. కార్మికుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ మండిపడుతోంది. ఇక ట్విట్టర్‌లోనూ రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి-టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
Samayam Telugu venkanna


Read Also: 'వల్లభనేని వంశీ నా స్నేహితుడే.. నేను ఎవరికీ డబ్బు ఇవ్వలేదు'

విజయసాయిరెడ్డి టీడీపీపై చేసిన వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ఉద్యమాలపై మీ సెటైర్లు బాగున్నాయి. కానీ మీ సెటైర్లు భవన నిర్మాణ కార్మికులకు కూడు పెట్టవు. భవన నిర్మాణ కార్మికులకు చేతి నిండా పని ఉంది, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అవమానించి మాట్లాడటం మానుకోరా విజయసాయిరెడ్డి గారు’అన్నారు బుద్దా వెంకన్న.

Also Read: Chandrababu Naidu ఆ పని చేస్తానంటే మేం ఆపలేదుగా: విజయసాయిరెడ్డి

‘మీ ముఖ్యమంత్రి జగన్ గారు 30 లక్షల మంది నోటి కాడి కూడు లాగేసారు. అప్పుల పాలు చేసారు, ఆత్మహత్యలు చేసుకునేలా చేసారు. అయినా మీ ధన దాహం తీరదా? దీక్ష చేసిన ఖర్చుతో వెయ్యి కుటుంబాలు సంవత్సరం గడుస్తాయి అని సెలవిచ్చారు. ఎప్పటి లాగే చిన్న సవాల్. సీబీఐ చెప్పినట్టు మీరు దొబ్బిన 43 వేల కోట్లు రాష్ట్రానికి తిరిగి ఇవ్వండి సగం అప్పు తీరుతుంది. మేము ఒక్క రోజు దీక్షకి ఖర్చు చేసిన డబ్బు భవన నిర్మాణ కార్మికులకు ఇస్తాం. సవాల్ కి జగన్ రెడ్డి గారు, సాయి రెడ్డిగారు రెడీనా’అంటూ సవాల్ విసిరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.