యాప్నగరం

జగన్‌ నాతో ఆ పరీక్ష రాయడానికి సిద్ధమా.. టీడీపీ ఎమ్మెల్సీ సవాల్

Vijaya Sai Reddy| 'పేపర్ లీకేజ్ కానప్పుడు విచారణ జరపించడానికి భయం ఎందుకు. లీక్ చేసిన పేపర్ పంపించండి.. నేనూ, జగన్ పరీక్ష రాస్తా.. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం' టీడీపీ ఎమ్మెల్సీ సవాల్.

Samayam Telugu 17 Oct 2019, 7:15 pm
ఏపీలో ట్విట్టర్ వార్ మరింత ముదురుతోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి-టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. చంద్రబాబు టార్గెట్‌గా విజయసాయి సెటైర్లు పేలుస్తుంటే.. బుద్దా వెంకన్న అదే రేంజ్‌లో కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగాల విషయంలో ఇద్దరు ట్విట్టర్‌లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. విజయసాయి చేసిన ట్వీట్ల‌కు బుద్దా వెంకన్న ఓ అడుగు ముందకేసి సవాల్ విసిరారు.
Samayam Telugu buddha.


Read Also: 'బాలయ్యతో మోదీని తిట్టించింది నువ్వు కాదా బాబూ'

‘శకుని మామా లీకు వీరుడిని పట్టుకొని గ్రీకు వీరుడు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. నీకు నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు లీక్ చేసిన పేపర్ నాకు కూడా పంపండి. నేను, మీ సీఎం పరీక్ష రాస్తాం. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూసుకుందాం. సవాల్ కి సిద్ధమా శకుని మామా?’అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ‘గ్రామ సచివాలయం పరీక్ష నిజాయితీగా జరిపించాం అనే నమ్మకం ఉంటే లీకేజీ మీద విచారణ చేయించడానికి మీ తుగ్లక్ ఎందుకు భయపడుతున్నటు శకుని మామా? విజయసాయి రెడ్డి’అంటూ ప్రశ్నించారు బుద్దా వెంకన్న.
ఇంతకీ విజయసాయిరెడ్డి ఏమన్నారంటే!
‘గ్రామ కార్యకర్తలుగా ఎంపికైన వారిలో ఎవరికీ ఓనమాలు రావట. చంద్రబాబు గారి కడుపు మంట మాటలు. అందరూ తన కొడుకు నారా లోకేష్ లాగా మొద్దబ్బాయిలనుకుంటున్నాడు. లోకేశ్ తో పరీక్ష రాయించండి కనీసం పది మార్కులు కూడా తెచ్చుకోలేరని ఉద్యోగాలు సాధించిన యువత ఇప్పటికే సవాలు చేశారు’అంటూ చురకలంటించారు. ఈ ట్వీట్‌పై స్పందిస్తూ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.