యాప్నగరం

'విజయసాయిరెడ్డికి ఓపెన్ ఛాలెంజ్.. ఆ ట్వీట్ చేసే దమ్ముందా'

ఆ తప్పు జరగకపోతే రహస్య విచారణలు,ముఖ్యమంత్రి స్థాయిలో హడావిడి సమీక్షలు ఎందుకు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆ ట్వీట్ చేసే దమ్ముందా అంటూ ఛాలెంజ్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ.

Samayam Telugu 21 Sep 2019, 7:42 pm
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం దుమారం రేపింది. ఏపీపీఎస్సీలో ఉద్యోగులు పేపర్ లీక్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.. దీన్ని అస్త్రంగా చేసుకొని ప్రతిపక్షం టీడీపీ జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తోంది. కష్టపడి పరీక్షలు రాసిన నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడుతోంది. టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఇటు విజయసాయి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటరిచ్చారు.. ఎంపీపై ఘాటు ట్వీట్‌లు చేశారు.
Samayam Telugu vijaya sai


Read Also: 'రాజు' గారు ఏమైనట్లు.. టీడీపీలో హాట్ టాపిక్!

‘శకుని మామ విజయసాయిరెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్‌.. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జరిగిన పరీక్షల్లో స్కామ్ జరగలేదు అని ట్వీట్ పెట్టే దమ్ము ఉందా? పేపర్ లీక్ కాకపోతే రహస్య విచారణలు,ముఖ్యమంత్రి స్థాయిలో హడావిడి సమీక్షలు ఎందుకు పెడుతున్నారో చెప్పగలవా?’అంటూ ప్రశ్నించారు.

Don't Miss: వారంలోపే ఇద్దరు.. టీడీపీలో వరుస విషాదాలు.. మళ్లీ అదే సెంటిమెంట్!

‘పేపర్లు లీక్ అయ్యాయని మీ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసింది నిజం కాదా ? నీ ట్వీట్లతో పేపర్ లీక్ తో ఉద్యోగాలు సంపాదించిన వారికి ధైర్యం ఇచ్చినా,18 లక్షలమంది నిరుద్యోగులను మాత్రం అవమానపరుస్తున్నావు. అయినా అవినీతి రాజకీయాలలో ఆరితేరినవాడివి, నిరుద్యోగుల బాధ నీకేం తెలుస్తుందిలే!’అంటూ మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.