యాప్నగరం

YS Jaganకు టీడీపీ ఎమ్మెల్సీ స్పెషల్ గిఫ్ట్.. అమరావతి కోసం వినూత్న నిరసన

'నేనున్నాను.. నేను విన్నాను' అని జగన్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మరి అమరావతి రైతులు 22 రోజులుగా చేస్తున్న ఆందోళనలు కనిపించడం లేదా.. వినిపించడం లేదా అంటూ ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్సీ.

Samayam Telugu 8 Jan 2020, 1:42 pm
అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరుసగా 22వ రోజు రైతులు, అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నారు. రాజధాని గ్రామాల్లో దీక్షలు, ధర్నాలు నడుస్తున్నాయి.. రోడ్లపై బైఠాయించిన రైతులు.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతుగా పలు పార్టీలు దీక్షలు, నిరసనలు తెలియజేస్తున్నాయి. అమరావతితో పాటూ విజయవాడలోనూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Samayam Telugu cm.


రైతులకు మద్దతుగా.. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వినూత్నంగా నిరసన తెలియజేశారు. జగన్‌కు కళ్లజోడు, చెవి మిషన్‌ను గిఫ్ట్‌గా పంపించారు. జగన్ 'నేనున్నాను.. నేను విన్నాను' అన్నారని.. అమరావతి రైతులు 22 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే ఇలా గిఫ్ట్ పంపిస్తున్నాను అన్నారు. జగన్ ఎక్కడున్నారు‌? ఏం వింటున్నారు అంటూ ప్రశ్నించారు. అమరావతిలో రైతులు చనిపోతుంటే.. జగన్‌కు వినబడలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదా అన్నారు బుద్దా.
రైతులు చేస్తున్న ఆందోళనలపై ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని రైతులపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని.. మహిళలపై దాడి చేశారని మండిపడ్డారు. చంద్రబాబుపై అమరావతిలో దాడి జరిగితే.. నిరసన తెలిపే హక్కు ఉందని కేసులు పెట్టలేదని.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై దాడి చేస్తే కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.