యాప్నగరం

జనాలు వాటితో కొట్టేందుకు రెడీగా ఉన్నారు.. జగన్‌పై బుద్దా ఘాటు విమర్శలు

వైఎస్ జగన్ అవినీతి బాగోతాన్ని భారతదేశంలోని లా కాలేజీ పుస్తకాల్లో పాఠాలుగా చెబుతున్నారు. ఆయన అవినీతిపై అంతర్జాతీయ సమ్మిట్‌లలో పుంఖానుపుంఖాలుగా చర్చిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 23 Sep 2019, 6:25 pm
రివర్స్ టెండరింగ్‌తో చంద్రబాబు అవినీతి పోలవరం డ్యాం పునాదుల నుంచి ఉబికి వస్తుందంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటు సమాధానమిచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. నవరత్నాల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్‌, రాలిపోయిన రత్నాల మీద ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయా? అని ఎద్దేవా చేశారు.
Samayam Telugu Jagan serious desk




Must Read: తాటిచెట్టు ఎక్కి దూడకి గడ్డి కోశారట.. డిప్యూటీ సీఎంలపై లోకేష్ ఫైర్

ఆ విషయాలు పక్కన పెడితే 46 ఏళ్ల పసిబాలుడు తుగ్లక్ వైఎస్ జగన్ అవినీతి బాగోతాన్ని భారతదేశంలోని లా కాలేజీ పుస్తకాల్లో పాఠాలుగా చెబుతున్నారని విమర్శించారు. జగన్ అవినీతిపై అంతర్జాతీయ సమ్మిట్‌లలో పుంఖానుపుంఖాలుగా చర్చిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.



Also Read: జగన్ సర్కార్ ‘రివర్స్ రికార్డ్‌’.. ఈ సారి ఎంత మిగిలిందంటే..!

అవినీతి సాక్ష్యాలు సాక్షిలో మాత్రమే ఉబుకుతాయి తప్ప ఇంకెక్కడా కాదని బుద్దా అన్నారు. అబద్ధాలు ప్రచారం చేసి, శవరాజకీయాలు చేసి గెలిచారు కానీ ప్రజలపై ప్రేమ లేదని అన్నారు. అందుకే ప్రజలు చెప్పు తీసుకు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.