యాప్నగరం

అప్పటి నుంచి అన్నీ అపశకునాలే.. టీడీపీ ఎమ్మెల్సీ సెటైర్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు టచ్ చేస్తే దరిద్రం పట్టుకుంటుందంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 23 Oct 2019, 1:55 pm
టీడీపీ అధినేత చంద్రబాబు తన దరిద్రాన్ని దేశమంతటా అంటించారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ మీ నాయకుడు జగనేనని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్‌లానే ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu jagan. vijayasai.


జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రానికి అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయన్నారు. గోదావరిలో బోటు మునిగి 56 మంది చనిపోయారంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో 256 మంది రైతుల్ని మింగేశారంటూ విమర్శించారు. ఇసుక కొరత సృష్టించి లక్షల మంది కార్మికులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఇసుకని ఉచితంగా అందజేసి పేదలను కడుపునింపామన్నారు.

Also Read: ఆయన టచ్ చేస్తే అంతే.! అక్కడ కూడా అలానే.. విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు

నూతన విధానం పేరుతో సీఎం జగన్ ఇసుక లేకుండా చేసి కార్మికుల్ని నడిరోడ్డు మీద పడేశాడని ధ్వజమెత్తారు. పిల్లికి బిచ్చం పెట్టని మీరు పేదలకు పరమాన్నం పెడతారనుకోవడం భ్రమ అంటూ విమర్శలు గుప్పించారు. విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు.

ఇసుక కొరత కారణంగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులని రోడ్లపై నిలబెట్టారన్నారు. రాష్ట్రంలో ప్రజలు డెంగ్యూ, మలేరియాతో అల్లాడుతున్నారన్నారు. అన్నక్యాంటీన్లు మూసేసి పేదోడి పొట్ట కొట్టారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ డీఎన్ఏలో ఉన్న దరిద్రానికి ఫుల్ స్టాప్ పడదు సాయి రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.