యాప్నగరం

సీఎం జగన్‌కు కులపిచ్చి బాగా ముదిరి.. ‘రెడ్డివారే, తమకు దొడ్డవారు’.. ఎమ్మెల్సీ సంచలనం!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 28 Sep 2021, 6:55 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుల పిచ్చి బాగా ముదిరిపోయిందని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేవలం 4 శాతం ఉన్న తన రెడ్డి సామాజిక వర్గానికే పదవులన్నీ కట్టబెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
Samayam Telugu సీఎం జగన్


గతంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ‘రెడ్డివారే.. తమకు దొడ్డవారు’ అన్న మాటలను.. జగన్‌రెడ్డి తు.చా. తప్పకుండా పాటిస్తున్నారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ఓట్లతోనే ముఖ్యమంత్రి అయ్యారనే వాస్తవాన్ని వైఎస్ జగన్ విస్మరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెడ్లు తప్ప.. మరో వర్గాన్ని నమ్మనట్లుగా ముఖ్యమంత్రి జగన్ ప్రవర్తన ఉందన్నారు.

కులాలు, వర్గాలకు దూరంగా ఉండే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కుల పిచ్చి ఉందని దుష్ప్రచారం చేసి.. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారని బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ సీఎం జగన్ దగ్గర ఉండే గుమస్తా మొదలు ప్రభుత్వ సలహాదారుల వరకు.. అన్ని పదవులు తన వర్గానికే ఇస్తున్నారని బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.