యాప్నగరం

బోటు ప్రమాదం: అనుమతి ఇచ్చిన మంత్రి ఎవరు! టీడీపీ నేత అనుమానం

బోటు మునిగిన సమయంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో స్పష్టంగా చెప్పాలి. ప్రమాదానికి ప్రభుత్వమే కారణం. సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా డిమాండ్ చేశారు.

Samayam Telugu 2 Oct 2019, 2:32 pm
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో పర్యాటకుల బోటు మునిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 35 మందికి పైగా మరణించగా ఇంకా కొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కొత్త అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు వరదల సమయంలో బోటు ప్రయాణానికి అనుమతి ఇచ్చిన మంత్రి ఎవరని ప్రశ్నించారు. బోటు మునిగిపోవడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
Samayam Telugu pjimage (76)


Also Read: ఈ దశాబ్దపు పొలిటికల్ కమెడియన్లు వీళ్లే.. విజయసాయి సెటైర్లు

బోటు ప్రమాదంలో మరణించిన వారిలో ఇప్పటి వరకూ ఎంత మంది మృతదేహాలు వెలికితీశారు? ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉందని బుద్దా ప్రశ్నించారు. బోటు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న వారికి కనీసం మృతదేహాలను అందించలేని చేతగాని ప్రభుత్వమంటూ ఘాటు విమర్శలు చేశారు. గోదావరి వద్ద 144 సెక్షన్ పెట్టిన ఘనత కూడా తుగ్లక్ జగన్ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు.

పెద్ద పెద్ద విషయాలు మాట్లాడే ముందు విజయసాయి రెడ్డి బోటు ప్రమాద ఘటనకు సమాధానం చెప్పాలని బుద్దా అన్నారు. బోటు మునిగిన సమయంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. శ్మశానాలకు రంగులు వేసుకునే విజయసాయికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: వాళ్లని వదిలిపెట్టను.. అంతు చూస్తా.. చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని వార్నింగ్!

బోటు ప్రమాదం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బుద్దా తేల్చి చెప్పారు. ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.25 లక్షలు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఎప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ జగన్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.