ఏపీ ప్రభుత్వం, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి విరుచుకుపడ్డారు. మద్యపాన నిషేధం పేరిట భారీ స్కామ్కి తెరతీశారని ఆరోపించారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తుందని చెప్పి మద్యం షాపులు వైసీపీ నాయకుల దుకాణాల్లోనే పెడుతున్నారన్నారు. షాపుల్లో ఉద్యోగాలు ఆ పార్టీ కార్యకర్తలకే ఇస్తారన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ కంపెనీ అయినా తమ బ్రాండ్ పెట్టుకోవాలంటే రెండు శాతం జే - ట్యాక్స్(జగన్ ట్యాక్స్) కట్టాలంటూ సంచలన ఆరోపణలు చేశారు. Must Read : పాక్ ప్రధాని ఇమ్రాన్ బాటలో చంద్రబాబు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు
‘వైకాపా నాయకుల షాపుల్లో మద్యం దుకాణాలు, మీ కార్యకర్తలకు జగనన్న మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు, ఆ షాపులో ఏ కంపెనీ బ్రాండ్ అయినా పెట్టాలి అంటే 2 శాతం J-ట్యాక్స్...సూపర్ గా ఉంది 420 తాతయ్యా మీ మద్యపాన నిషేధం స్కామ్ !!’ అంటూ ట్వీట్ చేశారు.
మద్యం అమ్మకాలపైనా బుద్దా స్పందించారు. మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు. అయితే మద్యం ఆదాయం ఎలా పెరుగుతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. మద్యపాన నిషేధం చేసేశామని మహిళల చెవిలో పూలు పెట్టొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
Also Read :‘జగన్ గారూ.. మీ మాటలకు విశ్వసనీయత లేదని ఒప్పుకోండి..’
‘నువ్వు నీ తుగ్లక్ కలిసి మద్యపాన నిషేధం చేసేశారా? చెవిలో పువ్వు పెట్టడానికి మహిళలే దొరికారా?’ అంటూ ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేస్తే మద్యం ఆదాయం ఎలా పెరిగింది? అమ్మకాలు ఎలా పెరుగుతున్నాయంటూ నిలదీశారు. దొంగ లెక్కల మాస్టారు.. చెవిలో పూలు పెట్టకండి అంటూ సెటైర్లు వేశారు.
‘వైకాపా నాయకుల షాపుల్లో మద్యం దుకాణాలు, మీ కార్యకర్తలకు జగనన్న మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు, ఆ షాపులో ఏ కంపెనీ బ్రాండ్ అయినా పెట్టాలి అంటే 2 శాతం J-ట్యాక్స్...సూపర్ గా ఉంది 420 తాతయ్యా మీ మద్యపాన నిషేధం స్కామ్ !!’ అంటూ ట్వీట్ చేశారు.
మద్యం అమ్మకాలపైనా బుద్దా స్పందించారు. మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు. అయితే మద్యం ఆదాయం ఎలా పెరుగుతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. మద్యపాన నిషేధం చేసేశామని మహిళల చెవిలో పూలు పెట్టొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
Also Read :‘జగన్ గారూ.. మీ మాటలకు విశ్వసనీయత లేదని ఒప్పుకోండి..’
‘నువ్వు నీ తుగ్లక్ కలిసి మద్యపాన నిషేధం చేసేశారా? చెవిలో పువ్వు పెట్టడానికి మహిళలే దొరికారా?’ అంటూ ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేస్తే మద్యం ఆదాయం ఎలా పెరిగింది? అమ్మకాలు ఎలా పెరుగుతున్నాయంటూ నిలదీశారు. దొంగ లెక్కల మాస్టారు.. చెవిలో పూలు పెట్టకండి అంటూ సెటైర్లు వేశారు.