యాప్నగరం

Ysr Rythu Bharosa: జగన్ రూ.వెయ్యి పెంచారు కానీ.. ఆ క్లారిటీ మిస్సయ్యారట!

YS Jagan| నెల్లూరు జిల్లాలో మంగళవారం రైతు భరోసాను ప్రారంభిచనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్‌సీపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తోన్న టీడీపీ.

Samayam Telugu 14 Oct 2019, 6:44 pm
రైతు భరోసా పథకంపై టీడీపీ-వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ పథకంలో లబ్దిదారుల గుర్తింపులో అవకతవకలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. వైఎస్సార్‌సీపీ మాత్రం పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతోంది. టీడీపీ చేస్తున్న ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు చేస్తుంటే చంద్రబాబు నోరు పెగలడం లేదని.. కలలో కూడా ఊహించి ఉండరు రైతులను ఈ విధంగా ఆదుకోవచ్చని అంటూ సెటైర్లు పేల్చారు.
Samayam Telugu cm.


Read Also: జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా పెంపు

విజయసాయిరెడ్డి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటరిచ్చారు. ‘శకుని మామా విజయసాయిరెడ్డి, ప్రతి రైతుకు రూ. 12500 ఇస్తానన్నాడు మీ తుగ్లక్ జగన్.. అంటే 50 లక్షల మందికి ఇవ్వాల్సింది 6250కోట్లు. కానీ విడుదల చేసింది 5510కోట్లు. అంటే రైతుభరోసా అందేది కొందరికే అన్నమాట’అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
‘పోనీ మీరు మడమ తిప్పినట్లు రైతుకి ఇచ్చేది 6500 అయితే కావాల్సింది 3250 కోట్లే! మరి మిగతా 2260కోట్లు ఎవరికి ఇస్తున్నారు శకుని మామా ? జె టాక్స్ కింద జమాయించినట్లే కదా !!’అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.