యాప్నగరం

ఏపీ హైకోర్టుకు చేరిన సెలక్ట్ కమిటీ వ్యవహారం.. ఎమ్మెల్సీ దీపక్ పిటిషన్

కౌన్సిల్ తీర్మానం చేసినా కమిటీ ఏర్పాటు చేయడం లేదని పిటిషన్‌లో దీపక్ రెడ్డి ప్రస్తావించారు. సెలక్ట్ కమిటీ విషయంలో మండలి కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. మండలి ఛైర్మన్ ఆదేశాలను ఉల్లంఘించారని.. అధికార పక్షానికి మండలి సెక్రటరీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Samayam Telugu 26 May 2020, 12:35 pm
ఏపీ వికేంద్రీకరణ సీఎర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం హైకోర్టుకు చేరింది. శాసనమండలి తీర్మానాన్ని అమలు చేయడం లేదంటూ హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సెలక్ట్ కమిటీ వేయకుండా మండలి కార్యదర్శి నిబంధనలు ఉల్లంఘించారని పిటిషన్‌లో ప్రస్తావించారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని.. బిల్లుల పరిశీలనకు 8మందితో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
Samayam Telugu హైకోర్టులో పిటిషన్


కౌన్సిల్ తీర్మానం చేసినా కమిటీ ఏర్పాటు చేయడం లేదని పిటిషన్‌లో దీపక్ రెడ్డి ప్రస్తావించారు. సెలక్ట్ కమిటీ విషయంలో మండలి కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. మండలి ఛైర్మన్ ఆదేశాలను ఉల్లంఘించారని.. అధికార పక్షానికి మండలి సెక్రటరీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. క్విడ్ ప్రోకో కింద మండలి సెక్రటరీ పదవీకాలం కూడా పొడిగించారని.. ప్రతివాదులుగా మండలి కార్యదర్శి, ప్రభుత్వం, సహాయ కార్యదర్శి పేర్లు ప్రస్తావించారు. ఇవాళ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులకు అసెంబ్లీలో గ్రీన్ సిగ్నల్ లభించింది. కానీ శాసన మండలిలో మాత్రం బ్రేకులు పడ్డాయి. ఛైర్మన్‌ షరీఫ్ తనకున్న విచక్షణాధికారంతో బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. కానీ అప్పటి నుంచి కమిటీ ఏర్పాటు చేయలేదని దీపక్ రెడ్డి పిటిషన్ వేశారు. మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తే.. మండలి కార్యదర్శి వాటిని పక్కన పెట్టారని ప్రస్తావించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.