యాప్నగరం

TDP ఎమ్మెల్సీకి రెండోసారి కరోనా.. ఆరోగ్య పరిస్థితి విషమం

టీడీపీ ఎమ్మెల్సీకి రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Samayam Telugu 3 Dec 2020, 6:28 pm
ఏపీలో కరోనా కేసులు తగ్గాయి.. కానీ అక్కడక్కడా మాత్రం ప్రభావం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో పరిస్థితి కాస్త మారుతోంది.. సెకండ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనలో ఉండగా.. ఆయన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Samayam Telugu టీడీపీ ఎమ్మెల్సీ


మరోవైపు కరోనా రాజకీయ నేతలపైనా ప్రభావం చూపించింది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఈ మహమ్మారికి బలయ్యారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ తేలిందని వార్తలొచ్చాయి. దీంతో ఆయన్ను కలిసిన నేతలు కూడా హోంక్వారంటైన్ లోకి వెళ్లారని సమాచారం. సెకండ్ వేవ్ పొంచి ఉండటంతో అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.