యాప్నగరం

జీతం రూపాయి.. కిటికీలకు రూ.73 లక్షలు... జగన్‌పై లోకేశ్ సెటైర్లు

YS Jaganపై నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. నెలకు రూపాయి జీతం తీసుకుంటాన్నానని చెప్పే జగన్.. ఇంటి కిటికీలకు రూ.73 లక్షలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. జగన్ జనాలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Samayam Telugu 6 Nov 2019, 6:06 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. నెలకు రూపాయి జీతం తీసుకుంటున్నానని చెప్పే జగన్.. తన ఇంటి కిటికీల కోసం మాత్రం రూ.73 లక్షల ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు. నామమాత్ర జీతం తీసుకుంటాన్నానని చెప్పిన జగన్.. ఇలా జనాలను మోసం చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి అల్యూమినియం తలుపులు, కిటికీల ఏర్పాటు కోసం రూ.73 లక్షలు కేటాయిస్తూ.. సర్కారు జారీ చేసిన జీవోను ఆయన ట్వీట్ చేశారు.
Samayam Telugu pjimage - 2019-07-14T013206.712


జగన్ అసమర్థ, అహంకార పోకడలతో రిలయన్స్, అదానీలాంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు బై బై ఏపీ అంటూ ఒకదానివెంట ఒకటి రాష్ట్రం విడిచిపోతున్నాయని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంస్థల వెంటపడి, ఒప్పించి ఏపీకి తేవడానికి మేం పడిన కష్టమంతా ఇలా బూడిదలో పోసిన పన్నీరవుతుంటే బాధగా ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ఐదు నెలల పాలనలోనే రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయని లోకేశ్ ఆరోపించారు. ఐదు నెలల్లోనే ఇంత దారుణమైన పరిస్థితులు తెస్తే, ఐదేళ్లలో ఎవరూ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదని ప్రజలు అంటున్నారని ఆయన ట్వీట్ చేశారు. మిమ్మల్ని నమ్మి ఓటేసిన పాపానికి ప్రజలను ఇలా చావు ముందు నిలబెడతారా? అని ఆయన జగన్‌ను నిలదీశారు. ప్రజలను ఇన్నిరకాలుగా బాధ పెడుతూ మీకెలా నిద్రపడుతోంది? కాస్తయినా మానవత్వం ఉండాలిగా అని లోకేశ్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.