యాప్నగరం

టీడీపీకి డబుల్ షాక్.. నేడు జగన్ సమక్షంలో వైసీపీలోకి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే!

వైఎస్సార్‌సీపీలోకి కొనసాగుతున్న చేరికలు. టీడీపీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయిన టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే. నేడు జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరికలు.

Samayam Telugu 18 Mar 2020, 1:40 pm
స్థానిక సంస్థల ఎన్నికలవేళ టీడీపీకి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ముఖ్యమైన, సీనియర్ నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. అనంతపురం జిల్లాలోనూ మరో ముఖ్య నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల నేడు వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే పార్టీ అనుచరులతో కలిసి విజయవాడ బయల్దేరినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే నియోజకవర్గంలో తమ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో చర్చలు జరిపారట.
Samayam Telugu jagan


శమంతకమణి, యామిని బాల గత కొద్ది రోజులుగా అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నారట. తమ నియోజకవర్గంలో కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్ననట్లు తెలుస్తోంది. అంతేకాదు స్థానికంగా జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు కూడా వీరు దూరంగా ఉంటున్నారట. శమంతకమణి ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాలకు హాజరుకాలేదు. దీంతో టీడీపీలో ఆసక్తికర చర్చ జరిగింది.. అయితే అనారోగ్య కారణంతోనే రాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. కానీ తర్వాత కూడా ఇద్దరు మహిళ నేతలు పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నారు.

Also Read: కరోనా ఎఫెక్ట్: ఇంట్లో నుంచి వృద్ధుల్ని తరిమేశారు.. పాపం రాత్రంతా రోడ్డుపైనే..

శమంతకమణి కుమార్తె యామిని బాల 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం యామినికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. బండారు శ్రావణికి టికెట్ కేటాయించగా.. ఆమె వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓడిపోయారు.. టికెట్ కేటాయింపు విషయంలో శమంతకమణి, యామిని బాలలు అతమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.. తర్వాత అయిష్టంగానే పార్టీ కోసం పనిచేశారు. ఎన్నికల తర్వాత బండారు శ్రావణి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆమె యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతలు పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నారు.

Also Read: తెలంగాణలో మరో కరోనా పాజిటివ్.. ఆరుకు చేరిన కేసులు.. పూర్తి వివరాలివీ!

శమంతకమణి టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఓసారి శింగనమల ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో ముఖ్యనేతగా ఉన్నారు. అందుకే చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2014లో ఆమె కుమార్తె యామిని బాలకు ఎమ్మెల్యేగా చంద్రబాబు అవకాశం కల్పించారు. కానీ 2019నాటికి సీన్ మొత్తం మారిపోయింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జిల్లా నేతల సలహాతో శింగనమల నియోజకవర్గ అభ్యర్థిని మార్చేశారు. యామిని బాల బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు. తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు శమంతకమణి ప్రయత్నాలు చేశారు.. నేరుగా చంద్రబాబును కలిసి విజ్ఞ‌ప్తి చేశారు. కానీ కొన్ని సమీకరణాలతో యామిని బాలకు టికెట్ దక్కలేదని అప్పట్లో తెలుగుదేశం పార్టీలోనే చర్చ నడిచింది.

Also Read: 7వ నెలలోనే బలవంతపు డెలివరీ.. పుట్టింది మగా, ఆడా తెలియని గాంధీ సిబ్బంది!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.