యాప్నగరం

టార్గెట్ జగన్ సర్కార్.. ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు

ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్సీలు.. మంగళవారం హస్తినకు. సనమండలి రద్దు బిల్లు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల అంశంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, హోంమంత్రిలకు వివరించాలని భావిస్తున్నారు.

Samayam Telugu 17 Feb 2020, 5:25 pm
టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన ఖాయమైంది. మంగళవారం ఎమ్మెల్సీలు హస్తినకు వెళ్లనున్నారు. ఈ టూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటూ మరికొందరు కేంద్రమంత్రుల్ని కలవాలని భావిస్తున్నారు. ఎమ్మెల్సీలు రెండు రోజుల పాటూ ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.
Samayam Telugu mlcs


ఎమ్మెల్సీలు ముఖ్యంగా శాసనమండలి రద్దు బిల్లు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల అంశంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, హోంమంత్రిలకు వివరించాలని భావిస్తున్నారు. అలాగే రాజధాని ఉద్యమం, అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

గతవారమే ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్‌లను కలిశారు. శానసమండలి రద్దు, సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లు అంశంపై చర్చించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే శాసనమండలి రద్దు బిల్లుకు ఆమోదం తెలపాలని కోరారు. ఆయన కేంద్ర పెద్దల్ని కలిసిన నాలుగు రోజులకే టీడీపీ ఎమ్మెల్సీలు హస్తినబాట పట్టడం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.