యాప్నగరం

‘Chandrababu మళ్లీ సీఎం అయ్యింటే బాగుండేది.. కేంద్ర మంత్రుల్లోనూ ఇదే చర్చ’

అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమంటూ రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

Samayam Telugu 23 Oct 2019, 11:09 am
రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికర చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. అమరావతిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకుంది. బొత్స వ్యాఖ్యలతో అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. రాజధాని అంతా ఒక చోట ఏర్పాటైతే రాష్ట్రం అభివృద్ధి చెంది, యువతకు ఉద్యోగాలు వస్తాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆంధ్ర ప్రజలు పొరపాటు చేశారని, మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే ఎంతో బాగుండేదని కేంద్ర మంత్రులు కూడా అభిప్రాయపడుతున్నారని జయదేవ్ పేర్కొన్నారు.
Samayam Telugu cbn


Read Also: బోటు వెలికితీత: ధర్మాడి బృందానికి అభినందనలు.. మంత్రి కన్నబాబు

గత ఐదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి 600 అవార్డులు వచ్చాయని, అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు మన గొప్పదనం తెలుసని వివరించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఖర్చుచేశామని, విశాఖ, కాకినాడ, అనంతపురం లాంటి చోట్ల కూడా అభివృద్ధికి భారీగా వెచ్చించామని ఎంపీ తెలిపారు. రాజధానితో అనుసంధాన రహదారులకే రూ.9వేల కోట్లు వెచ్చించినట్లు జయదేశ్ పేర్కొన్నారు. అభివృద్ధి అనేది ఆర్థికపరమైన వెంచర్.. అది రాజధాని కేంద్రంలోనే ఉండాలని, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబయి నగరాలే ఇందుకు ఉదాహరణని ఆయన వివరించారు. ఇప్పటికే మనం వెనకబడి ఉన్నామని, అభివృద్ధికి భవిష్యత్తు ఉండాలంటే మనకు రాజధాని ఉండాలని జయదేవ్ స్పష్టం చేశారు.

Read Also: పులివెందుల వెళ్లొచ్చాకే ఇలా.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన తర్వాత తొలిసారి మంగళగిరి వచ్చిన గల్లా జయదేవ్‌ను పార్టీ నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన టీడీపీ సీనియర్ నేత ఉయ్యూరు నాగిరెడ్డి చిత్రపటానికి జయదేవ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.