యాప్నగరం

క్యాపిటల్ కావాలి.. క్యాంప్ ఆఫీస్ కాదు.. ‘రాజధాని’ కమిటీ నివేదికపై నిప్పులు చెరిగిన టీడీపీ ఎంపీ

ఏపీకి మూడు రాజధానుల అంశంపై ఘాటుగా స్పందించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని హైదరాబాద్‌ కోల్పోయామని.. అలాంటి పరిస్థితి రాకూడదనే చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించారని చెప్పారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే గందరగోళ పరిస్థితులు తెచ్చిందని మండిపడ్డారు.

Samayam Telugu 20 Dec 2019, 7:38 pm
ఏపీకి మూడు రాజధానుల అంశంపై ఘాటుగా స్పందించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని హైదరాబాద్‌ కోల్పోయామని.. అలాంటి పరిస్థితి రాకూడదనే చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించారని చెప్పారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే గందరగోళ పరిస్థితులు తెచ్చిందని మండిపడ్డారు.
Samayam Telugu tdp mp galla jayadev slams gn rao committee report
క్యాపిటల్ కావాలి.. క్యాంప్ ఆఫీస్ కాదు.. ‘రాజధాని’ కమిటీ నివేదికపై నిప్పులు చెరిగిన టీడీపీ ఎంపీ


​​రాజధాని ఎకనమికల్ ఇంజిన్..

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అధికార వికేంద్రీకరణ సరికాదని జయదేవ్ వ్యాఖ్యానించారు. పరిపాలన వికేంద్రీకరణ సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని రాష్ట్రానికి ఎకనమికల్ ఇంజిన్‌లా ఉండాలన్నారు జయదేవ్. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లా రాజధాని ఉండాలని.. అందుకే టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసిందన్నారు. విశాఖను ఫైనాన్స్ సిటీగా అభివృద్ధి చేయాలన్నారు.

​క్యాపిటల్ కావాలి.. క్యాంప్ ఆఫీస్ కాదు..

అలాగే జీఎన్ రావు కమిటీ నివేదికపై ఎంపీ జయదేవ్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలందరికీ క్యాపిటల్ అందుబాటులో ఉండాలి.. కానీ క్యాంప్ ఆఫీస్ కాదంటూ మండిపడ్డారు. రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలన్న జయదేవ్.. అవసరమైతే జిల్లాకో క్యాంపు కార్యాలయం కట్టుకోమనండి అంటూ ఎద్దేవా చఏశారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని.. అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

​సగం బడ్జెట్ దానికే..

అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో సచివాలయం, క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అలా అయితే సగం బడ్జెట్‌ టీఏ, డీఏలకే సరిపోతుందని జయదేవ్ వ్యాఖ్యానించారు. ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ తగ్గిపోతోందని.. ఇలాంటి పనులు చేస్తే నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. 30 వేల మంది రైతుల నుంచి భూములు తీసుకున్నప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు పార్టీ మారిందని ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటే రైతులు నష్టపోతారని ఆయన అన్నారు.

​సౌతాఫ్రికా వాళ్లే వద్దనుకుంటున్నారు..

సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సౌతాఫ్రికా ఏర్పాటు సమయంలో ఫ్రెంచ్ కాలనీ..డచ్ కాలనీ.. ఇంగ్లిష్ కాలనీ ఉన్నాయని, వాటిని కలిపే సమయంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకు మూడు రాజధానుల ఫార్ములాను అనుసరించారన్నారు. అది ఏపీకి ముమ్మాటికీ సరిపోదని.. నెల్సన్ మండేలా అంతటి వ్యక్తే మూడు రాజధానుల విధానాన్ని తిరస్కరించారని జయదేవ్ గుర్తు చేశారు. ఆర్థిక భారం అవుతుందని సౌతాప్రికా ప్రతినిధులు కూడా చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

​సీఎం ప్రభావితం చేశారు..

మూడు రాజధానుల అంశాన్ని తొలుత సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.. ఆ తరువాత అదే విషయాన్ని కమిటీ చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు. కమిటీ రిపోర్ట్‌ను ముఖ్యమంత్రి ప్రభావితం చేశారని ఆయన ఆరోపించారు. సభలో సీఎం చెప్పిన విషయాలే జీఎన్ రావు కమిటీ తెలిపిందని.. అందులో కొత్తగా ఏమీలేదని ఆయన వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.