యాప్నగరం

'జగనన్నా.. మీరు అనుకున్నట్లుగా'.. టీడీపీ ఎంపీ ఆసక్తికర ట్వీట్

ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అన్ని జగన్ అనుకున్నట్లుగా జరగవు.. నియంతలా పాలిద్దామనుకుంటే కుదరదు. ప్రతిదానికి ఓ పద్దతి ఉంటుంది అంటున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని.

Samayam Telugu 16 Mar 2020, 8:34 am
కరోనా తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తోంది. వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో హై అలర్ట్ ప్రకటించారు.. స్కూళ్లు, జన సమూహాలు ఉండే ప్రాంతాల ప్రదేశాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేశారు. అలాగే ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల సంఖ్య పెంచారు. ఇటు ఏపీలో అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు.. దీంతో రాజకీయంగానూ దుమారం రేగుతోంది.
Samayam Telugu jagan


'ఇది ప్రజాస్వామ్య దేశం జగన్ అన్నా నియంతలా పాలిదాం అనుకుంటే కుదరదు నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అన్ని నువ్వు అనుకున్నట్లు గా జరగవు ప్రతి దానికి ఒక్క పద్ధతి ఉంటుంది' అంటూ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.
'సీన్ రివర్స్ అయ్యింది ...నిన్నటి దాకా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు, చంద్రబాబు వెళ్లేవారని.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ, జగన్ వెళుతున్నారని పరోక్షంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ అసంతృప్తి.. కాసేపట్లో గవర్నర్ హరిచందన్‍ను కలవనున్న సీఎం జగన్. కరోనా భయమా...!. ఓటమి జ్వరమా' అంటూ ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.