యాప్నగరం

ఆ విషయంలో వైసీపీకి మద్దతివ్వకపోతే టీడీపీకి రాజీనామా.. ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్యలు

సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ విషయంలో టీడీపీ వ్యతిరేకిస్తే తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Samayam Telugu 16 Feb 2020, 10:39 pm
అవగాహన లేకనే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), దేశ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)కు పార్లమెంటులో మద్దతు తెలిపామని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెబుతున్నారని, అవగాహన లేని వారికి పదవులు ఎందుకని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్ వల్ల పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు.
Samayam Telugu kesineni nani


Also Read: ‘పులివెందుల పులి.. పిల్లి అయిందా..?’

సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా ఆదివారం కడప నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ తీర్మానాన్ని టీడీపీ అంగీకరించపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Also Read: ఏపీలో రెండు కులాల మధ్యే రాజకీయం.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంటులో కూడా సీఏఏ, ఎన్ఆర్‌సీ బిల్లులకు 22 మంది వైసీపీ ఎంపీలు, ఇద్దరు టీడీపీ ఎంపీలు అనుకూలంగా ఓటేశారని, తానొక్కడినే సభ నుంచి వాకౌట్ చేసినట్లు ఎంపీ నాని గుర్తు చేశారు. ముస్లింలను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాలకు వాడుకోబోనని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో సైతం హిందూ, ముస్లింలు సోదరులుగా పోరాడారని గుర్తు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కులాలు, మతాలు పేరుతో అరాచకాలు చేస్తోందని విమర్శించారు.

ముస్లింలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోనని చెప్పారు. ఈ విషయంలో తన మనస్సాక్షికి అనుగుణంగానే వెళ్తానని, అవసరమైతే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీకి సైతం వ్యతిరేకంగా వెళ్తానని వ్యాఖ్యానించారు.

Also Read: జగనోరిని అబద్ధాలు.. బాబోరి కథలు.. శ్రీకాకుళం యాసలో ఎంపీ, ఎమ్మెల్యే అదిరిపోయే పంచ్‌లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.