యాప్నగరం

YS Jagan కుటుంబం సంతోషంగా ఉండాలి.. టీడీపీ ఎంపీ ఆసక్తికర ట్వీట్

సీఎం వైఎస్ జగన్.. ఆయన పరివారం.. వైసీపీ నేతలకు క్రిస్మస్ ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతున్నాను. జగన్.. వైసీపీ నేతల కుటుంబాలు సంతోషంగా ఉండాలని టీడీపీ ఎంపీ ట్వీట్ చేశారు.

Samayam Telugu 25 Dec 2019, 3:50 pm
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌కి టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం జగన్‌తోపాటు ఆయన గ్యాంగ్‌.. వైసీపీ నేతలకు ప్రత్యేకంగా క్రిస్టమస్ శుభాకాంక్షలు చెబుతున్నానని నాని అన్నారు. జగన్.. వైసీపీ నేతల కుటుంబాలు సంతోషంగా ఉండాలని భగవంతుడిని కోరుకోవాలంటూ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష ఎంపీగా ఉండి.. జగన్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పడం వెనుక వేరే కారణం ఉందిలెండి.
Samayam Telugu jagan 1


ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. నిరసనలు.. దీక్షలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పిన జగన్.. మాట తప్పారని.. మడమ తిప్పారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: మూడు రాజధానుల నిర్ణయం..ఉప రాష్ట్రపతి వెంకయ్య కీలక వ్యాఖ్యలు

ఇలాంటి సమయంలో విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని.. సీఎం జగన్‌‌పై సెటైరికల్ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అందులో భాగంగానే సీఎం వైఎస్ జగన్.. ఆయన గ్యాంగ్.. వైసీపీ నేతలకు క్రిస్మస్ ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రాన్ని.. రాష్ట్ర ప్రజలను అనిశ్చితి లో పడేసిన సీఎం జగన్‌ అండ్ గ్యాంగ్‌కి ప్ర్యతేకమైన శుభాకాంక్షలు అంటూ సెటైర్లు పేల్చారు.

రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదన్న కేశినేని.. సీఎం జగన్.. వైసీపీ కుటుంబాలు మాత్రం సంతోషంగా ఉండాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మీరు మీ కుటుంబాలు మాత్రం సంతోషంగా ఉండాలని క్రిస్టమస్ సందర్భంగా భగవంతుడిని కోరుకోండి’ అంటూ సీఎం జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు.

Read Also: సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌కు రెండు ప్రాణాలు బలి.. గుంటూరులో ఘోర ప్రమాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.