యాప్నగరం

నీకున్న తెలివి ఇంకెవరికీ లేదు జగనన్న.. టీడీపీ ఎంపీ

మూడు రాజధానుల బిల్లు, రెండు రోజుల క్రితం ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై స్పందించిన టీడీపీ ఎంపీ.. జగన్‌కు ఉన్న తెలివితేటలు ఇంకెవరికి లేవంటూ ట్వీట్.

Samayam Telugu 24 Jan 2020, 2:30 pm
మూడు రాజధానుల బిల్లు తర్వాత ఏపీలో రాజకీయం వేడెక్కింది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించడం.. అనూహ్యంగా అసెంబ్లీలో మండలిలో పరిణామాలపై చర్చ జరగడం చక,చకా జరిగిపోయాయి. సోమవారం అసెంబ్లీలో దీనిపై చర్చిద్దామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.. దీంతో మండలి రద్దు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మండలి ఛైర్మన్ నిర్ణయంపై అధికార పార్టీ మండిపడుతుంటే.. మండలి రద్దు చేయడం విచిత్రంగా ఉందని టీడీపీ అంటోంది.
Samayam Telugu jagan.


తాజాగా ఇదే అంశంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ తీరును తప్పుబడుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు.. జగనన్న తెలివితేటలు ఇంకెవరికి లేవు సెటైర్లు పేల్చారు. నాని తన ట్వీట్‌లో.. ‘నీకున్న తెలివితేటలు ఈ దేశంలో ఎవరికీ లేవు జగన్ అన్న.. జగన్ ఉండి ఉంటే రాజ్యసభతో కూడా పని లేదు రద్దు చేయమనే వారు’అంటూ ఎద్దేవా చేశారు.
అంతకముందు జగన్ సర్కార్ టీడీపీ ఎంపీలపై తప్పుడు కేసులు పెడుతోందని నాని మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ కోసం రాష్ట్రం కోసం రైతులు కోసం పోరాడుతున్న ముగ్గురు టీడీపీ పార్లమెంటు సభ్యుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత నీదే జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. వాళ్లు ఎన్ని కేసులు పెడితే అన్ని సన్మానాలు చేసినట్లే అవుతుంది గుర్తుంచుకో అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.