యాప్నగరం

'జగన్ గారు జనాలు మిమ్మల్ని మెచ్చుకుంటారు'.. టీడీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్ గారు మీరు.. మీ 22మంది ఎంపీలు, వైఎస్సార్‌సీపీ ఎన్నికల్లో చెప్పినట్లు ఎప్పుడు చేస్తారు. ప్రజలు మీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.. మీరు ఆ పనిచేస్తే రాష్ట్ర ప్రజలు మెచ్చుకుంటారు.

Samayam Telugu 4 Feb 2020, 9:57 am
ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం పదే పదే చెబుతోంది. ఎన్నో సందర్బాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. తాజాగా మరోసారి పార్లమెంట్ సాక్షిగా హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా.. లేదా.. అంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు.. దీనికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు.
Samayam Telugu jagan


ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. జగన్ గారు మీరు.. మీ 22మంది ఎంపీలు, వైఎస్సార్‌సీపీ ఎన్నికల్లో చెప్పినట్లు హోదా ఎప్పుడు సాధిస్తారో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మీ ప్రతాపం శాంతి యుతంగా ఉద్యమం చేస్తున్న రైతుల మీద.. మహిళల మీద చూపించడం కాదు.. కేంద్రం మీద చూపించి మీరు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్ర ప్రజలు మెచ్చుకుంటారు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.