యాప్నగరం

టార్గెట్ జగన్ సర్కార్.. రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు

ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. అందుకే తాము రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు వివరించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని కాపాడాలని రాష్ట్రపతిని కోరామని.. రామనాథ్ కోవింద్ సానుకూలంగా స్పందిచారన్నారు.

Samayam Telugu 16 Jul 2020, 1:35 pm
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని టీడీపీ ఎంపీలు కలిశారు. రాష్ట్రంలో గత 13 నెలలుగా ఏపీలో పరిస్థితులపై, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి వివరించారు. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. అందుకే తాము రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు వివరించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని కాపాడాలని రాష్ట్రపతిని కోరామని.. రామనాథ్ కోవింద్ సానుకూలంగా స్పందిచారన్నారు. రాష్ట్రపతి కూడా ఈ అంశాలు తన దృష్టికి వచ్చాయని చెప్పారని.. దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుంటామని హామీ ఇచ్చారన్నారు.
Samayam Telugu చంద్రబాబు


ఏపీ సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని, ఆయనకు అనుకులంగా ఉండే విధంగా మలుచుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలపై కక్షపూరితంగా దాడులు చేయడం, రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారన్నారు. రాజ్యాంగ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై దాడులు, పేదల భూములు లాక్కోవడం, ప్రతిపక్షాలకు చెందిన వారిపై హింస, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, దళితులపై దాడులపై రాష్ట్రపతికి ప్రధానంగా ఫిర్యాదు చేశామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.