యాప్నగరం

‘జుట్టు పెంచినా, చొక్కా వేసుకున్నా జగన్ పన్ను వేస్తారు’

రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన నడుస్తోందని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించారు.

Samayam Telugu 19 Feb 2020, 3:32 pm
ఆంధ్రప్రదేశ్‌లో పిచ్చి తుగ్లక్‌ పాలన నడుస్తోందని, రాష్ట్ర భవిష్యత్‌ అపహాస్యం అవుతోందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విమర్శించారు. బుధవారం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ప్రజా చైతన్యయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను అధికారం కోసం ఇక్కడికి రాలేదని.. అధికారం తనకు కొత్త కాదన్నారు. గత 9 నెలల వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలే చూడాలన్నారు. ఒక్కసారి చాన్స్‌ అంటే ప్రజలు ఓటేశారని, ఇప్పుడు దాని పర్యావసానం అనుభవిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Samayam Telugu babu, jagan


Also Read: బీజేపీతో జగన్, టీడీపీతో ఒవైసీ.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు

తమను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను నాశనం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ సర్కార్ రద్దుల ప్రభుత్వమని చంద్రబాబు విమర్శించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లన్నీ రద్దు చేశారని, ఎక్కడైనా ఒక గంప మట్టి వేశారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చామని.. ఇప్పుడు వైసీపీ దొంగలు ఇనుకను అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు.

Also Read: అలా చేయడానికి చంద్రబాబు పిచ్చోడు కాదు.. మంత్రి నాని సంచలన వ్యాఖ్యలు

ఇసుక, సిమెంట్‌, మద్యం ధరలు పెంచేశారని చంద్రబాబు ఆరోపించారు. జే ట్యాక్స్‌ కట్టిన బ్రాండ్‌ల మద్యానికే రాష్ట్రంలో అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. కరెంట్‌ ధరలు పెంచేశారని, పీపీఏలను రద్దు చేశారని, సోలార్‌ విండ్‌ని సంక్షోభంలోకి నెట్టారన్నారు. అలాగే బస్‌ చార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచారన్నారు. చివరకు ప్రజలు చొక్కా వేసుకున్నా.. జుట్టు పెంచినా పన్ను వేసేలా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Also Read: రాజధాని తరలింపు: హైకోర్టుకు కీలక విషయం చెప్పిన వైసీపీ సర్కార్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.