యాప్నగరం

తిరుపతి ఉప ఎన్నిక: టీడీపీ దూకుడు.. రంగంలోకి మాజీ సీఎం తమ్ముడు

తిరుపతిలో టీడీపీ నేతలు ఎన్నికల వ్యూహంపై చర్చించారు. పార్టీ విజయం కోసం నేతలంతా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించారు.

Samayam Telugu 26 Nov 2020, 4:51 pm
తిరుపతి ఉప ఎన్నికకు టీడీపీ సై అంటోంది. అభ్యర్థిని ప్రకటించిన దూకుడు పెంచి.. నేతలు, కేడర్‌ను సమాయత్తం చేస్తోంది. గెలుపు లక్ష్యంగా సమావేశాలు ప్రారంభించింది. గురువారం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యాలయంలో ఏరియా సమావేశం ఏర్పాటు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటూ స్థానిక నేతలు పాల్గొన్నారు.. ఎన్నికల వ్యూహంపై చర్చించారు. పార్టీ విజయం కోసం నేతలంతా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించారు.
Samayam Telugu తిరుపతి


వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసుగు చెందారని.. తిరుపతి ఉప ఎన్నికలో అధికార పార్టీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజల్లో సీఎం జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని.. ఈ ఎన్నికల్లో జగన్ ఎత్తుగడలు పనిచేయవన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అదేశాలతో నాయకుల సమన్వయంతో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పనభాక లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యదిక మెజార్టీ సాధించేందుకు నాయకులంతా కష్టపడి పనిచేయాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.