యాప్నగరం

YS Jagan గ్యాంగ్ రూ. లక్ష కోట్ల దోపిడీ, ఇవిగో ప్రూఫ్స్.. మాజీ ఆర్థిక మంత్రి సంచలనం

YS Jagan Mohan Reddy: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని మాజీ మంత్రి యనమల ఆరోపించారు.

Samayam Telugu 28 Nov 2020, 5:44 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల రక్తాన్ని జలగ పీల్చినట్టు పీల్చేస్తున్నారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రావాల్సిన రాబడి మొత్తం జగన్ గ్యాంగ్‌ జేబుల్లోకి పోతోందని, పేదలపై మాత్రం పన్నుల భారం మోపుతున్నారని విమర్శించారు. జగన్‌ ఏడాదిన్నరలోనే పన్నులు, చార్జీల పెంపు ద్వారా రూ.70 వేల కోట్ల భారం మోపి పేదల రక్తాన్ని జలగలా పీల్చేస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu వైఎస్ జగన్

‘‘పట్టణ భూముల విలువ పెంపుతో ప్రజలపై రూ. 800 కోట్ల భారం పడనుంది. ఆస్తి పన్ను 15 శాతం పెంపుతో రూ.8 వేల కోట్ల భారం పడనుంది. సీఎన్జీపై 10 శాతం వ్యాట్‌ పెంచి రూ. 300 కోట్ల భారం మోపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇష్టానుసారం పెంచి రూ. 1,800 కోట్ల భారం వేశారు. దొడ్డిదారిన విద్యుత్‌ బిల్లులు పెంచి రూ. 3 వేల కోట్ల భారం మోపారు. యూజర్‌ చార్జీల పెంపుతో రూ. 2,400 కోట్లు, రవాణా పన్నుల పెంపుతో రూ. 400 కోట్ల భారం మోపారు.

నిత్యావసరాల ధరలు 200 శాతం నుంచి 300 శాతం వరకు పెంచేశారు. మద్యం రేట్లు 200 నుంచి 300 శాతం వరకు పెంచి రూ. 9 వేల కోట్ల భారం వేశారు. ఇసుక దోపిడీలో జే గ్యాంగ్‌ రూ. 18 వేల కోట్లు కొల్లగొట్టారు. మద్యం మాఫియాలో రూ. 25 వేల కోట్ల దోపిడీ జరిగింది.. మైనింగ్‌ మాఫియాతో రూ. 30 వేల కోట్ల దోపిడీ, సిమెంట్‌ సిండికేట్‌తో రూ. 15 వేల కోట్ల దోపిడీ, ఇళ్ల స్థలాలు, భూసేకరణలో రూ. 4 వేల కోట్ల దోపిడీ జరిగింది. ఇలా ఏడాదిన్నరలో మొత్తం రూ. లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారు’’ అని యనమల ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.