యాప్నగరం

వైఎస్ విరోధి.. చివరకు జగన్ చెంతకు.. ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

Samayam Telugu 11 Mar 2020, 10:55 pm
టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి బుధవారం అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ గిరి సైతం వైసీపీలో చేరారు.
Samayam Telugu rsr 1


అనంతరం రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భావం నుంచి తమ కుటుంబం ఆ పార్టీలో ఉందని తెలిపారు. దశాబ్దాల పాటు టీడీపీలో ఉండి సేవలు అందించడమే కాకుండా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాను జైల్లో ఉన్నా కార్యకర్తలు టీడీపీలో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. కార్యకర్తల అభీష్టారం మేరకే తాను స్వచ్ఛందంగా వైసీపీలో చేరినట్లు వెల్లడించారు. మమ్మల్ని ఎవరూ బెదిర లేదని, మనస్ఫూర్తిగా వైసీపీలో చేరినట్లు తెలిపారు. టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేకనే పార్టీ మారుతున్నట్లు చెప్పారు.

Also Read: వైసీపీ పదేళ్ల ప్రస్థానం.. సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్

సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయని రామసుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నా డైనమిక్‌ లీడర్‌‌షిప్‌తో సీఎం జగన్‌ ముందుకు వెళుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం మంచి నిర్ణయమన్నారు ప్రజాదరణతో ఏర్పడిన ప్రభుత్వంలో పాలుపంచుకోవాలనే తాము పార్టీలో చేరామని, తమను పార్టీలో చేర్చుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో వైరం నెరుపుతున్న రామసుబ్బారెడ్డి చివరకు దివంగత వైఎస్సార్ వారసుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెంతకు చేరడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.