యాప్నగరం

జాతీయ పతాకాన్ని జగన్ రివర్స్ చేసేశారు.. ఫోటోలతో సహా టీడీపీ సంచలన ట్వీట్

ప్రముఖ దినపత్రికలో జాతీయ పతాకాన్ని రివర్స్‌గా ముద్రించారు. దీంతో జగన్ పాలనలో జాతయ పతాకాన్ని కూడా రివర్స్ చేసేశారని టీడీపీ ట్వీట్ చేసింది.

Samayam Telugu 16 Aug 2020, 4:47 pm
ఏపీలో ఓ వైపు కరోనా కేసులతో పాటు... మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శల దాడి కూడా వాడవేడిగా కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య పరస్పర మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా జగన్ పాలనపై మరోసారి టీడీపీ సెటైర్లు వేసింది. పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాలో జగన్ పాలనపై మరోసారి విమర్శలు గుప్పించింది. సాక్షి పత్రికలో వచ్చిన రాష్ట్రాన్నే "రివర్స్" చేసిన జగన్ గారు, ఇప్పుడు ఏకంగా మన దేశ జాతీయ పతకాన్ని కూడా తన సాక్షిలో "రివర్స్" చేసి పడేసారు. బహుశా తమ ప్రభుత్వ విధానం, "రివర్స్" అని చెప్తున్నారేమో. అంటూ ట్వీట్ చేశారు.
Samayam Telugu ఏపీ సీఎం జగన్
ap cm jagan mohan reddy


టీడీపీ సాక్షి పత్రికలో వచ్చిన ఓ కథనంలో వాడిన జాతీయ పతాకంకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇందులో జాతీయ పతాకం రివర్స్‌గా ఎగురవేసినట్లు ఫోటో ఉంది. దిగువున ఉండాల్సిన ఆకుపచ్చ రంగు పైన...పైన ఉండాల్సిక కాషాయం రంగు కిందన ఉంది. దీంతో జాతీయ పతాకాన్ని కూడా జగన్ రివర్స్ చేసేశారంటూ టీడీపీ చురకలంటించింది.

రాజధాని అమరావతి మొదలు పోలవరం, గృహనిర్మాణం తదితర అన్నింటా ముఖ్యమంత్రి జగన్‌ రివర్స్‌ పాలన చేస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ విమర్శిస్తుంది. ఎన్నికల ముందు రాజధాని విషయంలో మార్పు ఉండదని చెప్పి తర్వాత మూడు రాజధానులంటూ మడమ తిప్పారని టీడీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేశారు. రాజధాని విషయంలో రైతులకు అండగా ఉన్న న్యాయస్థానాలను సామాజిక మాధ్యమాల ద్వారా దూషిస్తూ కొందరు వైసీపీ మూర్ఖత్వాన్ని చాటుకుంటున్నారని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.