విశాఖపట్నంలో గత మూడున్నర సంవత్సరాల్లో 70 వేల ఎకరాల భూమి చేతులు మారిందని తెలుగు దేశం పార్టీ శాసనసభాపక్షం ఆరోపించింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో రాజధాని అంశంపై ప్రభుత్వం వైఖరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం తదితర అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశం ముగిసిన తర్వాత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. సమావేశ వివరాలు వెల్లడించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే సీఎం జగన్ దృష్టిలో పరిపాలన వికేంద్రీకరణ అని మండిపడ్డారు. కుట్రతో అమరావతిని 3 ముక్కలు చేసి పరిపాలన వికేంద్రీకరణ అంటే తెలుగుజాతి క్షమించదని హెచ్చరించారు. ఉత్తరాంధ్రపై అంత అభిమానం ఉంటే మూడున్నరేళ్లుగా విశాఖపట్నంను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన కోట్లాది రూపాయల విలువైన సంస్థల్ని ఎందుకు వెళ్లగొట్టారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం దోపిడీనే లక్ష్యంగా మందీమార్బలాన్ని దింపి అడ్డంగా దోచుకుంటూ కులాల మధ్య కుంపటి పెడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని రైతులపై ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించటం దుర్మార్గమన్నారు. ఏదో ఒక రకంగా అమరావతిని చిదిమేయాలనే కుట్రకు సీఎం జగన్ తెరలేపి.. కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే తపనే సీఎం జగన్ మాటల్లో వ్యక్తమైందని ఎమ్మెల్యే ఏలూరి వ్యాఖ్యానించారు. తమ అసమర్థత, చేతకాని తనం కప్పిపుచ్చుకునేందుకే సీఎం జగన్ గురువారం అసెంబ్లీలో మళ్లీ అమరావతిపై తన ద్వేషం వెళ్లగక్కారని దుయ్యబట్టారు. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టుగా ఉక్కుసంకల్పంతో చంద్రబాబు అమరావతికి బీజం వేస్తే.. జగన్ దానిని చంపేశారని మండిపడ్డారు. ఖర్చు లేకుండా అమరావతి అభివృద్ధికి తెలుగుదేశం ప్రణాళికలు సిద్ధం చేస్తే.. రూ. లక్షల కోట్లు కావాలంటూ అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. దేవుళ్లని కూడా సీఎం రాజకీయాలకు వాడుకుంటున్నారని ఏలూరి సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశం ముగిసిన తర్వాత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. సమావేశ వివరాలు వెల్లడించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే సీఎం జగన్ దృష్టిలో పరిపాలన వికేంద్రీకరణ అని మండిపడ్డారు. కుట్రతో అమరావతిని 3 ముక్కలు చేసి పరిపాలన వికేంద్రీకరణ అంటే తెలుగుజాతి క్షమించదని హెచ్చరించారు. ఉత్తరాంధ్రపై అంత అభిమానం ఉంటే మూడున్నరేళ్లుగా విశాఖపట్నంను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన కోట్లాది రూపాయల విలువైన సంస్థల్ని ఎందుకు వెళ్లగొట్టారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం దోపిడీనే లక్ష్యంగా మందీమార్బలాన్ని దింపి అడ్డంగా దోచుకుంటూ కులాల మధ్య కుంపటి పెడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని రైతులపై ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించటం దుర్మార్గమన్నారు. ఏదో ఒక రకంగా అమరావతిని చిదిమేయాలనే కుట్రకు సీఎం జగన్ తెరలేపి.. కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే తపనే సీఎం జగన్ మాటల్లో వ్యక్తమైందని ఎమ్మెల్యే ఏలూరి వ్యాఖ్యానించారు. తమ అసమర్థత, చేతకాని తనం కప్పిపుచ్చుకునేందుకే సీఎం జగన్ గురువారం అసెంబ్లీలో మళ్లీ అమరావతిపై తన ద్వేషం వెళ్లగక్కారని దుయ్యబట్టారు. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టుగా ఉక్కుసంకల్పంతో చంద్రబాబు అమరావతికి బీజం వేస్తే.. జగన్ దానిని చంపేశారని మండిపడ్డారు. ఖర్చు లేకుండా అమరావతి అభివృద్ధికి తెలుగుదేశం ప్రణాళికలు సిద్ధం చేస్తే.. రూ. లక్షల కోట్లు కావాలంటూ అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. దేవుళ్లని కూడా సీఎం రాజకీయాలకు వాడుకుంటున్నారని ఏలూరి సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.