యాప్నగరం

మండలి చైర్మన్‌కు టీడీపీ నోటీస్.. మూడు రాజధానుల బిల్లుపై ఉత్కంఠ

వికేంద్రీకరణ బిల్లులపై చర్చించకూడదని రూల్ 90 కింద టీడీపీ నోటీసులు ఇచ్చింది. ఈ బిల్లులు గతంలోనే సెలెక్ట్ కమిటీ ముందున్నాయని టీడీపీ నోటీసులో పేర్కొంది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినా సెక్రటరీ దానికి అనుగుణంగా వ్యవహరించ లేదని గుర్తు చేస్తోంది.

Samayam Telugu 17 Jun 2020, 1:19 pm
వికేంద్రీకరణ బిల్లు (మూడు రాజధానుల బిల్లు), ఆర్డీఏ రద్దు బిల్లుల వ్యవహారం మళ్లీ ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం ఈ బిల్లుల్ని అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపారు. దీంతో ఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలిలో చర్చించడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. వికేంద్రీకరణ బిల్లులపై చర్చించకూడదని రూల్ 90 కింద టీడీపీ నోటీసులు ఇచ్చింది. ఈ బిల్లులు గతంలోనే సెలెక్ట్ కమిటీ ముందున్నాయని టీడీపీ నోటీసులో పేర్కొంది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినా సెక్రటరీ దానికి అనుగుణంగా వ్యవహరించ లేదని గుర్తు చేస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకునే అధికారం ఉందని.. ఈ బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకే పంపాలని టీడీపీ అంటోంది.
Samayam Telugu ఏపీ శాసనమండలి


మరోవైపు బిల్లులు మండలికి రావడంతో వైఎస్సార్‌సీపీ, టీడీపీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ బిల్లుల వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలతో ఉమ్మారెడ్డి.. టీడీపీ ఎమ్మెల్సీలతో యనమల చర్చించారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ బిల్లులపై ఓటింగ్‌కు పట్టుబట్టాలని టీడీపీ భావిస్తోంది. సభ్యులంతా ఓటు వేయాలని యనమల అన్నారు. మరోవైపు యనమల తీరుపై ఉమ్మారెడ్డి మండిపడ్డారు. యనమల వాదనలకు తలా తోక ఉండదన్నారు. బిల్లుపై ఓటింగ్ పెట్టి రిజక్ట్ చేసినా.. నెల తర్వాత పాస్ అవుతాయని ఆయన చెబుతున్నారు. దీంతో శాసనమండలిలో ఏం జరుగుతుందనే టెన్షన్ మొదలైంది.. అంతేకాదు టీడీపీ ఇప్పటికే ఎమ్మెల్సీలకు విప్ జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.