యాప్నగరం

ఏపీలో మళ్లీ 'ఇసుక' తుఫాన్.. రోడ్డెక్కిన టీడీపీ

ఏపీలో మళ్లీ రోడ్డెక్కిన టీడీపీ.. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల కష్టాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు. చంద్రబాబు పిలుపుతో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టిన టీడీపీ కేడర్.

Samayam Telugu 25 Oct 2019, 11:25 am
ఏపీలో రాజకీయ ఇసుక (కొరతపై) తుఫాన్ మళ్లీ మొదలయ్యింది. ఇసుక కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ నిరసనలు తెలిపింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదంటూ మళ్లీ ఆందోళలనకు దిగింది.అధినేత చంద్రబాబు పిలుపుతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలతో ఆ పార్టీ కేడర్ హోరెత్తిస్తోంది. ఇసుక కొరతతో పాటూ జగన్ సర్కార్ తీరును నిరసిస్తూ 13 జిల్లాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఆందోళనలు చేపడుతున్నారు. వినూత్న రీతిలో తమ నిరసనలు చేస్తున్నారు.
Samayam Telugu sand


ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో కూడా ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆందోళనల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్ల దగ్గర ధర్నాలకు చేపట్టేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. పోలీసులు తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఇసుక కొరతపై పశ్చిమ గోదావరి పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆకలి కేక పేరుతో పాలకొల్లు నుంచి నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. ఉచిత ఇసుక పాలసీని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.