యాప్నగరం

ఏపీ వాళ్లు ఇక్కడే ఉండండి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Coronavirus in Hyderabad: ఏపీ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎక్కడి వారు అక్కడే ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

Samayam Telugu 27 Mar 2020, 7:26 pm
హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఇక్కడే ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. హైదరాబాద్‌లో హాస్టళ్లు మూసేస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని, ఇక్కడే ఉండాలని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఒకచోట నుంచి మరో చోటకు కదలకుండా ఉండటమే మంచిందన్నారు. ఈ మేరకు శుక్రవారం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ..
Samayam Telugu kcr 1


తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్లందరికి ఆహార వసతి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని, ఇతర రాష్ట్రాల ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్స్‌ మూసివేయబోరని, ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

తెలంగాణలో ఉన్న ఏ రాష్ట్ర ప్రజలైనా వారి పొట్టలు నింపుతామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. అందరికీ ఆహార వసతి ఏర్పాటు చేస్తామన్నారు. గృహ నిర్మాణం, నీటిపారుదల సహా ఇతర రంగాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడి వచ్చి పనిచేస్తున్నారని, అలాంటి వారికి ఆశ్రయం కల్పించి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

అనేక మంది పరిశీలకుల అంచనా ప్రకారం అమెరికా, చైనా, స్పెయిన్‌, ఇటలీ స్థాయిలో మన దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందితే 20 కోట్ల మందికి వైరస్‌ సోకే అవకాశముంటుందని చెబుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీనికి ఎవరూ అతీతులు కాదన్నారు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, ఈ ఆపత్కాల సమయంలో స్వీయనియంత్రణే శ్రీరామరక్ష అని కేసీఆర్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.