యాప్నగరం

నగరిలో కేసీఆర్ లంచ్.. ఆతిథ్యమివ్వనున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంచీపురం నుంచి తిరుగు ప్రయాణంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా నివాసానికి రానున్నారు. మధ్యాహ్న సమయంలో ఆమె ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేయనున్నారు.

Samayam Telugu 12 Aug 2019, 11:01 am
Samayam Telugu pjimage (12)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తమిళనాడులోని కాంచీపురంలో గల అత్తివరదర్ ‌స్వామివారిని కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. ఇందుకోసం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కాంచీపురం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో కేసీఆర్ చిత్తూరు జిల్లా నగరిలో ఆగనున్నారు.

మధ్యాహ్నం 2గంటల సమయంలో కుటుంబసభ్యులతో కలిసి నగరికి చేరుకోనున్న కేసీఆర్ వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్కే రోజా ఇంటికి వెళ్లనున్నారు. మధ్యాహ్న భోజనం ఆమె ఇంట్లోనే చేయనున్నారు. కేసీఆర్ కోసం రోజా రాయలసీమ ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ రాక సందర్భంగా రోజా ఇంటి పోలీసులు భద్రత పటిష్టం చేశారు.

అనంతరం 4 గంటల సమయంలో కేసీఆర్ తిరుపతి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారా? లేక తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారా? అన్న దానిపై స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ అధికారులు తమకిచ్చిన షెడ్యూల్‌లో తిరుమల పర్యటన లేదని చిత్తూరు పోలీసులు చెబుతున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా చిత్తూరు జిల్లాలో పలుచోట్ల స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.