యాప్నగరం

ఏపీ రాజధానిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు పరోక్షంగా..

మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణలో జిల్లాల ఏర్పాటును ప్రస్తావిస్తూ.. ఏపీ రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు. జగన్ పరోక్షంగా హెచ్చరించిన తెలంగాణ మంత్రి.

Samayam Telugu 17 Jan 2020, 2:31 pm
ఏపీ రాజధాని అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జిల్లాల ఏర్పాటును ప్రస్తావిస్తూ.. పరోక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను హెచ్చరించారు. శుక్రవారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా వ్యతిరేకత రాలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Samayam Telugu ktr.


తెలంగాణలో పరిస్థితి అలా ఉంటే.. ఏపీలో రాజధాని విషయంలో వ్యతిరేకత ఎందుకు వస్తుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల గురించి ప్రకటన వచ్చిన తర్వాత వస్తున్న విమర్శలు, అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనల్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే జనసేన-బీజేపీ పొత్తుపైనా కేటీఆర్ స్పందించారు.. పవన్ పార్టీ అంతర్జాతీయ పార్టీ అవుతుందేమోనని వ్యాఖ్యానించారు.
నాలుగు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అలాగే మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మూడు రాజధానుల అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. కేసీఆర్ సైతం జగన్ నిర్ణయాన్ని సమర్థించినట్లు వార్తలు వినిపించాయి. ఇలాంటి సందర్భంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.