యాప్నగరం

విశాఖలో తెలంగాణ మంత్రి.. కారణం ఏంటంటే

విశాఖలో పర్యటించిన తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. గంగవరం పోర్టులో వియత్నాం నుంచి వచ్చిన యూరియాను పరిశీలించిన మంత్రి. త్వరగా యూరియా తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నాలు.

Samayam Telugu 12 Sep 2019, 7:33 pm

ప్రధానాంశాలు:

  • తెలంగాణలో ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి
  • యూరియా విషయంలో రాద్దాంతం చేస్తున్నారు
  • ప్రజలకు వాస్తవాలను తెలియచెబుతాం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu niranjan
తెలంగాణ మంత్రి విశాఖ వెళ్లడమేంటని అనుకుంటున్నారా. నిజమే వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం విశాఖ వెళ్లారు.. గంగవరం పోర్టులో వియత్నా నుంచి దిగుమతి చేసుకున్న యూరియాను పరిశీలించారు. వెంటనే యూరియా బస్తాలను గంగవరం పోర్టు సీఈవో సాంబశివరావును కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మంత్రి వెంట వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కూడా ఉన్నారు.

Must Read: YSRCPలోకి తోట త్రిమూర్తులు.. ముహుర్తం ఫిక్స్?.. భగ్గుమన్న ఎమ్మెల్యే వర్గం
రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. యూరియా అందుబాటులో లేదంటూ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ప్రజలు, రైతుల్ని మభ్యపెట్టేందుకే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని.. వాస్తవ పరిస్థితిని వారికి వివరించి తెలియజేసేందుకు విశాఖ పర్యటనకు వచ్చామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.