యాప్నగరం

తల్లికీ, చెల్లికీ, భార్యకు తేడా తెలియని కుక్కలు.. చెడబుట్టిన చెత్త వెధవలు: వంగలపూడి అనిత

Vangalapudi Anitha ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. కొందరు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఇష్టం వచ్చినట్ల అసభ్య పోస్టర్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 28 Sep 2022, 1:39 pm

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vangalapudi Anitha
ఏపీ రాజకీయాలు సోషల్ మీడియాకు చేరాయి. వైఎస్సార్‌సీపీ (YSRCP), టీడీపీ (TDP)ల మధ్య ట్వీట్‌లు, పోస్టుల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాకు చెందిన కొందరు అసభ్యకరంగా పోస్టులు, ట్వీట్‌లు, పోస్టర్లు వేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.
‘అమ్మ కడుపున చెడబుట్టిన చెత్త వెధవలు. తల్లికీ, చెల్లికీ, భార్యకు తేడా తెలీని చిత్తకార్తె కుక్కలందరినీ ఒక చోట చేర్చి వైసీపీ సోషల్ మీడియా అని పేరు పెట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేక మహిళలపై అసభ్య పోస్టర్లు వేస్తున్న వీరిపై డీజీపీ చర్యలు తీసుకుంటారా? మమ్మల్ని చూసుకోమంటారా?’అంటూ అనిత ట్వీట్ చేశారు. డీజీపీని కూడా ట్వీట్‌లో ట్యాగ్ చేశారు.
మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. ప్రజా సమస్మలను పక్కదారిపట్టించేందుకు వైఎస్సార్‌సీపీ నీతిమాలిన చర్యలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో రోజు రోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, సీబీఐ,ఈడీ కేసులు, కోర్టుల చివాట్లు, అధికార పార్టీ నేతల అవినీతిపై ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఇలాంటి చర్యలు సమాజానికి చేటని.. వైఎస్సార్‌సీపీ నీతిమాలిన చర్యలకు తెలుగు దేశం కార్యకర్తలు, నేతలు ఎవరూ ప్రభావితం కావొద్దు అన్నారు. ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలను, పతనమైన ఆలోచనలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.. తమ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజా స్వామ్య పద్దతిలోనే టీడీపీ ప్రజా సమస్యలపై పోరాడుతుందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతలు తమ వైఖరి మార్చుకోకపోతే రాజకీయాల్లో ఉండే అర్హతను సైతం కోల్పోతారు అని గుర్తు పెట్టుకోవాలన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.