యాప్నగరం

అమరావతి రైతులకు ఎన్‌ఆర్‌ఐల అండ.. ఏకంగా 200 నగరాల్లో

అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా 200 సిటీల నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిగా ప్రజా రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ మద్దతు తెలిపారు.

Samayam Telugu 4 Jul 2020, 1:01 pm
అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరుకుంది.. ఆరు నెలలకుపైగా ఈ ఉద్యమం నిర్విరామంగా సాగుతోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే నినాదాన్ని వినిపిస్తూ రైతులు, మహిళలు, చిన్నారులు పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటించిన రోజు నుంచి నిద్రాహారాలు మాని దీక్షలు, ధర్నాలు, ర్యాలీలతో నిరసను తెలియజేస్తున్నారు.
Samayam Telugu అమరావతి ఉద్యమం


రాజధాని గ్రామాలైన వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి, తాళ్లపాలెం, బేతపూడి.. ఇలా అన్ని చోట్ల ఉద్యమం కొనసాగుతోంది. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాజధానిని ఇక్కడే కొనసాగిస్తామని చెప్పే వరకు వెనక్కు తగ్గేది లేదంటున్నారు.

అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా 200 సిటీల నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిగా ప్రజా రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ మద్దతు తెలిపారు. అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రవాసాంద్ర తెలుగు అసోషియేషన్ తరపున క్యాండిల్స్‌తో మద్దతు తెలపనున్నారు.
అమరావతి ఉద్యమాన్ని, నినాదాన్ని సోషల్ మీడియా ద్వారా యావత్ దేశానికి వినిపించాలని అమరావతి జేఏసీ నేతలు పిలుపును ఇచ్చారు. అంతేకాదు అమరావతితో పాటూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దీక్షకు దిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.